వచ్చే ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే : స్పష్టం చేసిన గంగూలీ
నెక్ట్స్ ఇయర్ ఐపీఎల్, ఇండియాలో జరగనుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ టీమ్ భవిష్యత్ ప్రణాళికలపై బోర్డు ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ స్పందించారు.
నెక్ట్స్ ఇయర్ ఐపీఎల్, ఇండియాలో జరగనుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ టీమ్ భవిష్యత్ ప్రణాళికలపై బోర్డు ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ఆస్ట్రేలియా టూర్ అనంతరం వచ్చే సంవత్సరం ఇంగ్లాండ్కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు స్టేట్ క్రికెట్ బోర్డులకు రాసిన లేఖలో గంగూలీ తెలియజేశాడు. దీని తర్వాత ఏప్రిల్లో ఐపీఎల్ను నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. వీటితో పాటే టీ20 వరల్డ్ కప్(2021), వన్డే వరల్డ్ కప్లకూ(2023) ఇండియా ఆతిథ్యమివ్వనుందని తెలిపాడు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను యూఏఈలో జరపాల్సి వచ్చినట్టు వివరించాడు.
“ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్-2020 జరగనుంది. అంతా సక్రమంగా జరిగేందకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరిస్థితులన్నీ కుదుటపడిన తర్వాత దేశవాళీ క్రికెట్ను తిరిగి స్టార్ట్ చేస్తాం. ప్లేయర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే కరోనా నుంచి మనందరం బయటకు వస్తామని ఆశిస్తున్నా” అని సౌరభ్ గంగూలీ తెలిపాడు.
Also Read :