గ్రేటర్ ఎన్నికలు : మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓటర్లకుటీఆర్ఎస్  కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ వర్గీయులు ఆందోళన చేపట్టారు.

గ్రేటర్ ఎన్నికలు : మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 01, 2020 | 12:04 PM

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓటర్లకు టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ వర్గీయులు ఆందోళన చేపట్టారు. మియాపూర్ సమీపంలో న్యూ హఫీజ్‎పేట్ లోని ఆదిత్యనగర్‎ పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లరకు డబ్బులు పంచుతుండగా మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ రెడ్ హ్యండెడ్‎గా పట్టుకున్నారు. దాంతో టీఆర్ఎస్ , బీజేవీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలను చెదరగొట్టారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకు వైపే మాట్లాడుతున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.