సోష‌ల్ మీడియాలో నేను సైతం, కంగనా అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్

బాలీవుడ్​ క‌థానాయిక‌​ కంగనా రనౌత్..​​ ట్విట్టర్​లో అఫిషియ‌ల్‌గా చేరినట్లు ప్రకటించింది. ఓ వీడియో పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది.

సోష‌ల్ మీడియాలో నేను సైతం, కంగనా అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్
Follow us

|

Updated on: Aug 21, 2020 | 7:56 PM

బాలీవుడ్​ క‌థానాయిక‌​ కంగనా రనౌత్..​​ ట్విట్టర్​లో అఫిషియ‌ల్‌గా చేరినట్లు ప్రకటించింది. ఓ వీడియో పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. ఇప్పటి వరకు టీమ్​ కంగనా రనౌత్​ పేరుతో ఈ అకౌంట్‌ నడుస్తుండగా.. ఇప్పుడు ఆ పేరును కంగనా రనౌత్​గా ఛేంజ్ చేశారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ మద్దతు కోరుతూ, సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ ​మీడియాలో చేరడానికి గల కారణాలను వివ‌రించింది.

“అందరికీ న‌మ‌స్తే. గత 15 సంవత్సరాల నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాను. గతంలోనే చాలా మంది నన్ను సామాజిక మాధ్య‌మాల్లో చేరాలని ఒత్తిడి చేశారు. కానీ ఇష్టం లేనందున ఇంట్ర‌స్ట్ లేద‌ని చెప్పా. ఇందులో నేను లేనందున చాలా మంది నా గురించి చాలా ర‌కాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా నాకు చేరాలని అనిపించలేదు. నా ఫ్యాన్స్‌కు , నాకు మధ్య ఎప్పుడూ డిస్టెన్స్ ఉన్నట్లు భావించలేదు. నేను నటించిన చిత్రాల ద్వారా మహిళా సాధికారతపై అనేక మెసేజ్‌లు ఇచ్చాను. ఈ ఏడాది సోషల్​ మీడియా పవర్ ఏంటో​ చూశా. సుశాంత్​ కోసం ప్రపంచమంతా ఎలా కలిసి పోరాడిందో గమనించా. కచ్చితంగా మనం విజయం సాధిస్తాం ” అని కంగన చెప్పింది.

Also Read :

బంగారం ధ‌ర త‌గ్గిందండోయ్, వెండి మాత్రం కొండెక్కింది

Latest Articles