అయ్యబాబోయ్.. ఏం అందం.! సింధూరం మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.?
నాటి క్రేజీ హీరోయిన్లలో సంఘవి ఒకరు. తనదైన శైలి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడమే కాదు.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోల సైతం నటించింది ఈ భామ.
![అయ్యబాబోయ్.. ఏం అందం.! సింధూరం మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-1-1.jpg?w=1280)
నాటి క్రేజీ హీరోయిన్లలో సంఘవి ఒకరు. తనదైన శైలి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడమే కాదు.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోల సైతం నటించింది ఈ భామ. దాదాపు 15 ఏళ్ల సినీ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 80కి పైగా చిత్రాల్లో నటించింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. డిగ్రీ అనంతరం సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.. అలా తన పేరును కూడా సంఘవిగా మార్చుకుంది. శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును ఫిదా చేసింది.
ఇక డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం మూవీ సంఘవికి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. 1997లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. సంఘవికి వరుస ఆఫర్లు తెచ్చిపెట్టింది. దీంతో తక్కువ సమయంలోనే సంఘవి.. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలిగిపోయింది. 2005లో తెలుగులో ‘ఒక్కడే కాని ఇద్దరు’ సంఘవి చివరి చిత్రం కాగా.. 2008లో కన్నడ చిత్రం ‘ఇంద్ర’తో ఇండస్ట్రీకి దూరమైంది సంఘవి. అనంతరం బుల్లితెరపై ‘గోకులతిల్ సీతై’, ‘సావిత్రి’, ‘కాలభైరవ’ లాంటి సీరియల్స్లో నటించింది. ఇక ఆ తర్వాత తనకు సరైన ఆఫర్స్ రాకపోవడంతో.. 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. సినీ ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది సంఘవి. వీరికి ఓ పాప జన్మించింది. కాగా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి.. తన టైం అంతటిని ఫ్యామిలీతో గడుపుతోంది.
View this post on Instagram