ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది మెగా కోడలు ఉపాసన. ఇందులో భాగంగా అత్త కోడళ్లు కలిసి ప్రీ కుక్డ్ ఫుడ్, ఇన్స్టంట్ మిక్స్లు తయారు చేస్తున్నారు. అంతేకాదు వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. వేసవి కాలం సందర్భంగా తాజాగా నోరూరించే ఆవకాయ పచ్చడిని రెడీ చేసింది మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ. ఇదే సందర్భంలో అక్కడకు వచ్చిన మెగా కోడలు ఉపాసన సురేఖ మామిడి కాయ పచ్చడిని కలిపే సమయంలో వీడియో తీసింది. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మొదటగా చిరంజీవి తల్లి అంజనా దేవి కనిపిస్తారు. దీంతో ఉపాసన వెళ్లి ‘ మీరు ఎందుకు నాయనమ్మ సీరియస్ గా ఉన్నారు’ అని అంజనాదేవిని అడుగుతుంది. దీనికి ఆమె పని లేక ఇక్కడ కూర్చున్నాను’ అని పంచ్ ఇస్తారు. మీ కోడలు మంచిగా పికెల్(ఊరగాయ) చేయడం లేదా? అని అత్తపై ఫిర్యాదు చేస్తుంది ఉపాసన. అందుకు ప్రతిగా అంజనమ్మ .. ‘నువ్వున్నావ్ కదా.. మళ్లీ కోడలికి ఎందుకు పని? అని సరదాగా కౌంటర్ ఇస్తారు.
ఆ తర్వాత వీడియోను సురేఖ దగ్గరికి తీసుకు వెళుతుంది రామ్ చరణ్ భార్య. అత్తమ్మ దగ్గరకు వెళ్లి ‘క్యా హో రా’ అని అడగ్గా.. తనకు హిందీ రాదని నవ్వేసింది సురేఖ. ఆ తర్వాత వెల్కమ్ టు ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఆ వీడియో చివర్లో తెలుపుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగాభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ షూటింగు లో పాల్గొంటున్నారు.
అవకాయ పచ్చడి తయారీలో సురేఖ.. వీడియో
#Upasanakonidela cute Telugu 😅with her Ammama & Athamma
Surekha gaaru making Avakay pachadi for #Athamma‘sKitchen pic.twitter.com/Y41sEz3dUa
— Filmy Bowl (@FilmyBowl) April 20, 2024
Nothing is beautiful than wife celebrating her husband’s success 🥹🩷️#GlobalStarRamCharan #RamCharan #DrKonidelaRamCharan #UpasanaKonidela pic.twitter.com/HKjwBq3eBx
— AlwaysRamCharanFanGirl (@RC_fangirl) April 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.