Rajamouli-Mahesh: అతడే నా హీరో.. చాలా అందంగా ఉంటాడు, మహేశ్ మూవీపై రాజమౌళి ఫస్ట్ రియాక్షన్

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సూపర్ హిట్స్ సినిమాలను తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఎస్ ఎస్ ఎంబీ29' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటిస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rajamouli-Mahesh: అతడే నా హీరో.. చాలా అందంగా ఉంటాడు, మహేశ్ మూవీపై రాజమౌళి ఫస్ట్ రియాక్షన్
Mahesh Babu
Follow us

|

Updated on: Mar 19, 2024 | 1:06 PM

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సూపర్ హిట్స్ సినిమాలను తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబీ29’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు. మొదటిసారి రాజమౌళితో సినిమా చేస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని మహేశ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళి కొన్ని లేటెస్ట్ అప్డేట్ షేర్ చేసుకోవడంతో అభిమానుల్లో ఆనందం నింపుతోంది.

‘ఆర్ఆర్ఆర్’ విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా మహేష్ తో తన తదుపరి సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పుడు జపాన్ లో ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రిలీజ్ అయ్యి 513వ రోజు కొన్ని థియేటర్లలో రన్ అవుతున్న స్పెషల్ షో చూశారు. ఇటీవల జపాన్ పర్యటనకు వెళ్లిన రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 గురించి ఓ అప్డేడ్ గురించి వెల్లడించారు. ”రైటింగ్ పూర్తయింది, ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్నాం. హీరో మాత్రమే కన్ఫర్మ్ అయ్యాడు. అతని పేరు మహేష్ బాబు. చాలా అందంగా ఉంటాడు. సినిమా నిర్మాణాన్ని వేగవంతం చేసి, విడుదల సమయంలో ఇక్కడికి తీసుకువస్తా” అని రాజమౌళి అన్నారు.

ఎస్ఎస్ఎంబి 29 ఇప్పటికే సంచలనం రేపుతోంది. రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సరికొత్త బెంచ్ మార్క్ గా  సెట్ చేస్తుందని భావిస్తున్నారు. దీంతో ఇండియన్ సినిమాల్లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. మహేష్ బాబు సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని టాక్. సాధారణంగా భారీ పారితోషికం తీసుకునే మహేష్ (ఒక్కో సినిమాకు రూ.60 నుంచి రూ.80 కోట్ల వరకు) ఈ ప్రాజెక్ట్ కోసం కూడా ప్రాఫిట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.