రాపాక వరప్రసాద రావు
రాపాక వరప్రసాద రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కీలక నేత.. రాపాక రాజోలు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాపాక వరప్రసాద రావు 1958లోఆంధ్రప్రదేశ్,తూర్పు గోదావరి జిల్లా, మలికిపురం మండలం, చింతలమోరి గ్రామంలో జన్మించారు. రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి నల్లి వెంకటకృష్ణ మల్లిక్ పై 5869 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించగా టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాపాక వరప్రసాద్ 14 సెప్టెంబర్ 2018లో జనసేన పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. అయితే, 2024 ఎన్నికల్లో రాపాక వరప్రసాద రావు కు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా.. వైసీపీ రాజోలు స్థానంలో గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ కేటాయించింది. వరప్రసాదరావును అమలాపురం పార్లమెంట్ స్థానానికి వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది.