అత్తింటి వేధింపులకు మరో మహిళ బలి..

అత్తింటి వేధింపులకు మరో మహిళ బలైంది. అక్షిత అనే 25 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ శివారు శంషాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయిన అల్లుడు రాఘవేందర్ రెడ్డి, అతని ఫ్యామిలీ మెంబర్స్ అకృత్యాలకే తన బిడ్డ బలైపోయిందని అక్షిత తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన అక్షితకు శంషాబాద్‌లోని ఆర్బీనగర్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన దగ్గర్నుంచీ అదనపు […]

అత్తింటి వేధింపులకు మరో మహిళ బలి..
Follow us

| Edited By:

Updated on: May 26, 2019 | 6:22 PM

అత్తింటి వేధింపులకు మరో మహిళ బలైంది. అక్షిత అనే 25 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ శివారు శంషాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయిన అల్లుడు రాఘవేందర్ రెడ్డి, అతని ఫ్యామిలీ మెంబర్స్ అకృత్యాలకే తన బిడ్డ బలైపోయిందని అక్షిత తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

ఇబ్రహీంపట్నంకు చెందిన అక్షితకు శంషాబాద్‌లోని ఆర్బీనగర్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన దగ్గర్నుంచీ అదనపు కట్నం కావాలంటూ తన కుమార్తెను భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తూ వచ్చారని మృతురాలి తల్లి చెబుతున్నారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ కుటుంబసభ్యులు అక్షిత అత్తారింటి ముందు ఆందోళనకు దిగారు. భర్త, అత్తమాలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అక్షిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు.