నేను ప్లాస్మా అందుకే ఇవ్వలేదు : రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా బారిన పడి కోలుకున్న సగంతి తెలిసిందే. కరోనా సోకిన సమయంలో ఆయన ఓ ప్రకటన చేశారు. తాను కోలుకున్నాక ప్లాస్మా ఇస్తానని ఆయన అందులో పేర్కొన్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా బారిన పడి కోలుకున్న సగంతి తెలిసిందే. కరోనా సోకిన సమయంలో ఆయన ఓ ప్రకటన చేశారు. తాను కోలుకున్నాక ప్లాస్మా ఇస్తానని ఆయన అందులో పేర్కొన్నారు. అయితే, ఆయన ప్లాస్మా ఇవ్వలేకపోయారు. ఇందుకు కారణాలను తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
అయితే రాజమౌళి కుటుంబంతోపాటు సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబం కూడా కరోనా బారిన పడింది. కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ కిమ్స్ హాస్పిటల్లో ప్లాస్మాను డొనేట్ చేశారు. రాజమౌళి మాత్రం ప్లాస్మా దానం చేయలేక పోయారు. ఎందుకు చేయలేదో కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.
తమలో ‘‘యాంటీ బాడీస్ కోసం టెస్ట్ చేశారు. నా ఐజీజీ లెవల్స్ 8.62గా ఉన్నాయి. కానీ ఆ లెవల్స్ 15గా ఉండాలి. ఈరోజు పెద్దన్నయ్య, భైరవ ప్లాస్మాను డొనేట్ చేశారు’’ అన్నారు రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
Tested for antibodies.. My igG levels are 8.62. They should be above 15 to be able to donate… Peddanna and Bhairava donated today… pic.twitter.com/5zVmj0dvt0
— rajamouli ss (@ssrajamouli) September 1, 2020