సవాల్ని స్వీకరించిన రాక్స్టార్.. తల్లి, మేనల్లుడితో కలిసి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సవాల్ని స్వీకరిస్తోన్న సినీ, రాజకీయ ప్రముఖులు మొక్కలను నాటుతూ.. తమ సన్నిహితులకు ఛాలెంజ్ని విసురుతున్నారు. ఇక తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని స్వీకరించిన రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్.. తన తల్లి, మేనల్లుడు సాయంతో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం గొప్పదని చెబుతూ.. దర్శకుడు హరీష్ శంకర్, నటి శ్రుతీ హాసన్కు ఛాలెంజ్ విసిరారు. వారితో పాటు ”నీ కన్ను నీలి సముద్రం” పాటను, తన సంగీతాన్ని ఇష్టపడే వారు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఇక దీనికి శ్రుతీ స్పందిస్తూ.. నన్ను నామినేట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నారు. అలాగే హరీష్ శంకర్.. సవాల్ని స్వీకరించాను సర్ జీ అంటూ కామెంట్ పెట్టారు.
Read This Story Also: రూ.3,500 కోట్లను వ్యక్తిగత సంస్థలకు ఇచ్చిన వీజీ సిద్ధార్థ
ThnkU Ravi Sir @MythriOfficial 4 nominating me & @MPsantoshtrs sir 4 leading??
Wit guidance of my Mother (gardening Expert) & help of my Nephew?,I planted these?
I further nominate dear @harish2you & PILLAA @shrutihaasan Cmon Guys??#GreenindiaChallenge ?#HarithaHaaram pic.twitter.com/JTZlMg3gqW
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 28, 2020