ఢిల్లీలో పట్టపగలు క్రిమినల్ కాల్చివేత

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ఓ వ్యక్తిని పట్టపగలు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. 2011 లో ఓ హత్య కేసులో దోషి అయిన యోగేష్ అనే ఈ కిల్లర్ బెయిలుపై ఉన్నాడని, ఇది తెలుసుకున్న వ్యక్తులు ఢిల్లీ దక్షిణపురి ప్రాంతంలో..

ఢిల్లీలో పట్టపగలు క్రిమినల్ కాల్చివేత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 7:43 PM

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ఓ వ్యక్తిని పట్టపగలు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. 2011 లో ఓ హత్య కేసులో దోషి అయిన యోగేష్ అనే ఈ కిల్లర్ బెయిలుపై ఉన్నాడని, ఇది తెలుసుకున్న వ్యక్తులు ఢిల్లీ దక్షిణపురి ప్రాంతంలో కారులో ఉండగా కాల్పులు జరిపి పారిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. బహుశా పాత కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.