15 వేల మార్క్ దాటిన ఢిల్లీ కొవిడ్ పాజిటివ్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా ప్రతి రోజు 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య పదిహేను వేల మార్కును దాటి 15,257కు చేరింది. ఢిల్లీలో మరణాల […]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా ప్రతి రోజు 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య పదిహేను వేల మార్కును దాటి 15,257కు చేరింది. ఢిల్లీలో మరణాల సంఖ్య కూడా ఇప్పటి వరకు 303కు చేరుకున్నది. ఇక ఢిల్లీలో నమోదైన మొత్తం 15,257 కేసులలో 7264 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 7,690. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనాని కట్టడి చేయాలంటే ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటున్నారు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు.