ఉరి వేసుకుని క్రికెటర్ సూసైడ్
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ క్రికెటర్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కరణ్ తివాతీ (27) అనే క్రికెట్ ప్లేయర్ ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో నివసిస్తూంటాడు. సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని..
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ క్రికెటర్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కరణ్ తివాతీ (27) అనే క్రికెట్ ప్లేయర్ ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో నివసిస్తూంటాడు. సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరణ్ సాధారణ మధ్య తరగతికి చెందిన వ్యక్తి. ముంబై ప్రొఫెషనల్ జట్టులో నెట్ ప్రాక్టీస్ బౌలర్గా ఉన్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాకౌడౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో క్రికెట్కు సంబంధించి పలు టోర్నీలు, మ్యాచ్లు వాయిదా పడ్డాయి. దీంతో కరణ్ తన క్రికెట్ కెరీర్ పట్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న కురార్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
Read More:
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడి ఆరోగ్యం విషమం