యూపీలో ఎన్కౌంటర్.. ఇద్దరు పశువుల స్మగ్లర్లు అరెస్ట్..
యూపీలోని రాంపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పశువులను ఎస్యూవీ కార్లలో రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. రాంపూర్లోని సివిల్ లైన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
యూపీలోని రాంపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పశువులను ఎస్యూవీ కార్లలో రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. రాంపూర్లోని సివిల్ లైన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారు అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించి ఆపేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఈ క్రమంలో అందులో ఉన్న వ్యక్తులు పోలీసులపైకి కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే దుండగులపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. మరోవైపు ఓ పోలీస్ కూడా దుండగుల కాల్పుల్లో గాయపడ్డాడు. దుండగులు ఉపయోగించిన ఎస్యూవీ కారులో ఓ పశువును స్వాధీనం చేసుకున్నామని రాంపూర్ పోలీసులు తెలిపారు. అంతేకాదు.. ఓ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ముగ్గురు కూడా గోవుల స్మగ్లర్లని తేలింది. వీరి పేర్లు షేర్జ్మా, నౌమాన్, పర్వేజ్లుగా గుర్తించారు. ఎన్కౌంటర్ సమయంలో షేర్జ్మా కాలుకు గాయమైందని తెలిపారు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని.. ఇక మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు.