కామారెడ్డి జిల్లాలో ఓ డ్రైవర్ ఘాతుకం.. వాహనం ఆపమని అడిగినందుకు ఏకంగా అతడిపైకే ఎక్కించేశాడు..
ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు పనులు జరుగుతున్నాయి బండి
ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు పనులు జరుగుతున్నాయి బండి ఆపమని ముందుకు వచ్చినందుకు ఏకంగా అతడిపై నుంచి బండిని నడిపాడు ఓ దుర్మార్గపు డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి వద్ద జాతీయ రహదారి 44పై రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో ఓ కార్మికుడు వాహనాలు ప్రమాదానికి గురి కాకుండా దారి మళ్లించడం చేస్తున్నాడు.
అటుగా ఓ భారీ కంటెయినర్ రావడంతో ఆ కార్మికుడు ఆపడానికి ప్రయత్నించాడు. డ్రైవర్కు ఇటువైపుగా వాహనం నడపొద్దని సూచించాడు. అయినా కంటెయినర్ డ్రైవర్ లెక్కచేయకుండా అతడికి తగిలే విధంగా వాహనాన్ని నడిపాడు. దీంతో కార్మికుడు ప్రమాదవశాత్తు కంటెయినర్ వెనక చక్రాల కింద పడిపోయాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వాహనం ఆపమని అడిగినందుకు కంటెయినర్తో ఢీ కొట్టి చంపిన డ్రైవర్పై అక్కడి జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు.