గుడ్న్యూస్.. వ్యాక్సిన్ తయారీలో భారత్ తొలి అడుగు సక్సెస్.. త్వరలో రోగులపై ట్రయల్స్..
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా ఈ వైరస్ సోకి ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో దాదాపు రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. మరో పది లక్షల మంది వరకు కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మనదేశంలో కూడా దాదాపు నలభై వేల మందికి చేరువలతో ఈ వైరస్ బారినపడ్డ వారు ఉండగా.. వీరిలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు […]
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా ఈ వైరస్ సోకి ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో దాదాపు రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. మరో పది లక్షల మంది వరకు కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మనదేశంలో కూడా దాదాపు నలభై వేల మందికి చేరువలతో ఈ వైరస్ బారినపడ్డ వారు ఉండగా.. వీరిలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో పది వేల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే ఈ మహమ్మారి ఇంతలా రెచ్చిపోవడానికి కారణం.. దీనికి విరుగుడు మందు లేకపోవడం. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో బిజీబిజీగా ఉన్నాయి. అందులో మన దేశం కూడా.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో పురోగతిని సాధించాయి. తాజాగా.. ఎండబ్ల్యు వ్యాక్సిన్కు సంబంధించిన సేఫ్టీ ట్రయల్ విజయవంతంగా పూర్తయ్యింది. దీంతో ఇక ఈ వ్యాక్సిన్ను ఢిల్లీలోని ఎయిమ్స్, భోపాల్, పీజీఐ చండీగఢ్లలో రోగులపై పరీక్షించవలసి ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని పీజీఐఎంఈఆర్ డైరెక్టర్ డాక్టర్ జగత్ రామ్ వెల్లడించారు. ఎండబ్ల్యు వ్యాక్సిన్ సేఫ్టీ ట్రయల్ సక్సెస్ ఫుల్గా పూర్తయ్యిందన్నారు. ఇప్పుడు దీనిని 40 మంది రోగులపై ట్రయల్ టెస్ట్ చేయాలని తెలిపారు. కాగా.. దీనిని ఇప్పటికే టీబీ, సెప్సిస్ వంటి వ్యాధుల నివారణకు యూజ్ చేస్తున్నారు. తాజాగా దీనిని ఇప్పుడు కరోనా మహమ్మారి కట్టడికి కూడా వినియోగించనున్నారు.
The safety trial of ‘Mw vaccine’ drug has been completed. But its actual trial will be conducted on 40 patients in PGI Chandigarh, AIIMS-Delhi and AIIMS Bhopal: Dr Jagat Ram, Director PGIMER, Chandigarh#COVID19 pic.twitter.com/NVHlL5e62o
— ANI (@ANI) May 3, 2020