హోం మేడ్ మాస్క్తో మోదీ.. ప్రజలకిచ్చిన సందేశమిదే..!
ప్రధాని మోదీ శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ పొడగింపుతో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ మాస్క్ ధరించి పాల్గొన్నారు. అయితే మాస్క్ ధరించడం సాధారణ విషయమే అయినా.. ఆయన ధరించిన మాస్క్ హోం మేడ్ మాస్క్ అవ్వడం విశేషంగా మారింది. తెలుపు రంగులో ఉన్న మాస్క్ ధరించి.. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. ప్రస్తుతం […]
ప్రధాని మోదీ శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ పొడగింపుతో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ మాస్క్ ధరించి పాల్గొన్నారు. అయితే మాస్క్ ధరించడం సాధారణ విషయమే అయినా.. ఆయన ధరించిన మాస్క్ హోం మేడ్ మాస్క్ అవ్వడం విశేషంగా మారింది. తెలుపు రంగులో ఉన్న మాస్క్ ధరించి.. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు.
ప్రస్తుతం ఎక్కువ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. పలు రాష్ట్రాలు మాస్క్ను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనలు పెట్టాయి. దీంతో మాస్క్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్న క్రమంలో.. హోం మేడ్ మాస్క్లు కూడా ధరించవచ్చని మోదీ పరోక్షంగా సూచించినట్లైంది. ప్రజలు మాస్క్లు లేవని ఇబ్బంది పడకుండా ఇంట్లోనే తయారు చేసి ధరించవచ్చని ఆయన ధరించి ఓ సందేశాన్ని ఇచ్చారు. కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలంతా బయటకు వెళ్తే మాస్క్లు తప్పకుండా ధరించాలని సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మోదీతో పాటు.. పలువురు ముఖ్యమంత్రులు కూడా మాస్క్లు ధరించి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.