పిండిలో నోట్ల కట్టలు.. అది అతని పనే అంటోన్న అమీర్

దేశ రాజధాని ఢిల్లీలో.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గోధుమ పిండి ప్యాకెట్లలో నోట్లు పెట్టి పేద ప్రజలకు పంచారంటూ కొద్ది రోజుల క్రితం ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ఓ ప్రాంతంలో గోధుమ పిండి ప్యాకెట్లలో రూ.15 వేలు పెట్టి..

పిండిలో నోట్ల కట్టలు.. అది అతని పనే అంటోన్న అమీర్
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 3:47 PM

దేశ రాజధాని ఢిల్లీలో.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గోధుమ పిండి ప్యాకెట్లలో నోట్లు పెట్టి పేద ప్రజలకు పంచారంటూ కొద్ది రోజుల క్రితం ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ఓ ప్రాంతంలో గోధుమ పిండి ప్యాకెట్లలో రూ.15 వేలు పెట్టి పేదలకు పంచారు కొందరు సేవా కార్మికులు. ఒక్కోక్కరికి ఒకే గోధుమ పిండి బ్యాగ్ ఇచ్చారు. ఆ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో పిండితో పాటు డబ్బు కూడా ప్రత్యక్ష్యమైంది. పేద ప్రజలకు సహాయం అందించేందుకే అమీర్‌ ఖానే ఇలా ప్లాన్ చేసి ఉంటారని గతంలో ఈ వైరల్ వార్త తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ వివాదంపై అమీర్ ఖాన్ స్వయంగా స్పందించారు.

ఈ మేరకు అమీర్ ఖాన్ ట్వీట్ చేశారు. ‘నేను ఈ గోధుమ పిండి బ్యాగుల్లో డబ్బు పెట్టలేదు. ఇది అసత్య ప్రచారమై ఉండొచ్చు.. లేదంటే తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని రాబిన్ హుడ్ పని అయి ఉండాలి’. అంతేగానీ నాకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు’. అలాగే ఇంటి పట్టునే ఉండి.. సురక్షితంగా ఉండండి అని కూడా పేర్కొంటూ ట్వీట్ చేశారు.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!