కరోనా విలయ తాండవం.. ఒడిషాలో 167.. రాజస్థాన్‌లో 199..

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోతున్నాయి.

కరోనా విలయ తాండవం.. ఒడిషాలో 167.. రాజస్థాన్‌లో 199..
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 12:16 PM

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోతున్నాయి. మరోవైపు అంతకుముందు వందల్లో కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు.. రోజురోజుకు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఒడిషాలో మంగళవారం నాడు.. కొత్తగా167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,470కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,583 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 3,863 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

ఇక రాజస్థాన్‌లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,431కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 356 మంది మరణించారు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.