కరోనా నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..!

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య వేలాది పెరిగిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ ద‌య‌నీయంగా తయారైంది. కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..!
Follow us

|

Updated on: Jul 09, 2020 | 1:45 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య వేలాది పెరిగిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ ద‌య‌నీయంగా తయారైంది. కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తం టెస్టులు నిర్వహించి చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొవిడ్ రెస్పాన్స్ స్కీమ్ కింద రోజువారీ కూలీలు, గృహ సహాయకులు, ఆటో డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులకు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం నిషేధిత ప్రాంతాలు, బఫర్ జోన్లు, ఇతర ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు.

రిక్షా కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగి, ఆటో, టాక్సీ డ్రైవర్లు, పార్శిల్ పంపిణీదారులు మొద‌లైన వారిని ఈ జాబితాలో చేర్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్‌డబ్ల్యుఎ, పోలీసు, ఇతర విభాగాల సహాయంతో అర్హులైనవారిని గుర్తించి ఓ నివేదిక తయారు చేయ‌నున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ త‌దిత‌ర‌ ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి జాబితా సిద్ధం చేయాలని అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రతి ఒక్కిరికి కరోనా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా వైద్య సదుపాయాలు సమకూరేలా ఫ్లాన్ చేసింది ఢిల్లీ సర్కార్.