కరోనా ఎఫెక్ట్.. శాలరీ కట్ చేసుకున్న స్టార్ దర్శకుడు..!
కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై భారీగా పడింది. ప్రాంతీయ సినిమాలు మొదలు హాలీవుడ్ వరకు ఈ కరోనా చాలా ప్రభావాన్నే చూపింది.
కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై భారీగా పడింది. ప్రాంతీయ సినిమాలు మొదలు హాలీవుడ్ వరకు ఈ కరోనా చాలా ప్రభావాన్నే చూపింది. లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్లకు బ్రేక్ పడటం, సినిమాలు విడుదల అవ్వకపోవడంతో ఆర్థికంగా సినీ పరిశ్రమ దెబ్బతింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలను ఆదుకునేందుకు కోలీవుడ్లో సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. మొన్నటికి మొన్న నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ తన పారితోషికాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఆ లిస్ట్లోకి చేరారు స్టార్ దర్శకుడు హరి.
సూర్యతో హరి అరువ అనే చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. ఆ మూవీ కోసం తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్లో 25 శాతం కట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. కరోనా ప్రభావం కోలీవుడ్పై చాలా పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిర్మాతలకు మనం ఇబ్బందిగా ఉండకూడదు. లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకొని నా తదుపరి చిత్రం కోసం తీసుకోబోయే రెమ్యునరేషన్లో 25శాతం కట్ చేసుకుంటున్నా అని పేర్కొన్నారు. కాగా అరువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తుండగా.. రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్మన్ సంగీతాన్ని అందించనున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్ సెలబ్రిటీలు తమ రెమ్యునరేషన్ కట్ చేసుకుంటోన్న సమయంలో.. ఇక్కడ మన స్టార్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read This Story Also: ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ వెనకున్న అసలు కథ.. 104 డిగ్రీల జ్వరంతో డ్యాన్స్ వేసిన చిరు..!