మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా

మధ్యప్రదశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే సింధియా వర్గం ఎమ్మెల్యేలు దూరమవ్వడంతో ఏకంగా ప్రభుత్వమే కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కాంగ్రెస్..

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 8:12 PM

మధ్యప్రదశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే సింధియా వర్గం ఎమ్మెల్యేలు దూరమవ్వడంతో ఏకంగా ప్రభుత్వమే కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. హస్తానికి గుడ్‌ బై చెప్తూ.. కాషాయ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మంధాట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మకు తన రాజీనామా లేఖను అందజేశారు. ప్రొటెం స్పీకర్ రాజీనామాను వెంటనే ఆమోదించారు. దీంతో రాష్ట్రంలో27 అంసెబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.