గోదావరికి సీఎం కేసీఆర్ జలహారతి!
సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. మిడ్మానేరు బ్యాక్ వాటర్ను పరిశీలించిన ఆయన అనంతరం కుటుంబసమేతంగా కలిసి.. తంగళ్లపల్లి వంతెనపై నుంచి మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ సహా పలువురు వేములవాడ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు కేసీఆర్కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కాగా.. పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు […]
సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. మిడ్మానేరు బ్యాక్ వాటర్ను పరిశీలించిన ఆయన అనంతరం కుటుంబసమేతంగా కలిసి.. తంగళ్లపల్లి వంతెనపై నుంచి మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ సహా పలువురు వేములవాడ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు కేసీఆర్కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
కాగా.. పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. రాజన్న ఆలయంలో పూజలు అనంతరం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో తీగల గుట్టపల్లిలోని పార్టీ భవన్కు చేరుకుంటారు. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం తిరిగి హైదరాబాద్ రానున్నారు.