విగ్రహాల విధ్వంసంపై చిన జీయర్ స్వామి ఆగ్రహం.. ఈనెల 17 నుంచి దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరుగుతున్న వరుస దాడి ఘటనలపై త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..

విగ్రహాల విధ్వంసంపై చిన జీయర్ స్వామి ఆగ్రహం.. ఈనెల 17 నుంచి దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటన
Follow us

|

Updated on: Jan 05, 2021 | 5:03 PM

Chinna Jeeyar Swamy : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరుగుతున్న వరుస దాడి ఘటనలపై త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని విజయ కీలాద్రిపై చిన జీయర్ స్వామీజీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉపద్రవాలు జరిగినపుడు ఉపశమనం కల్పించడంతోపాటు తక్షణ కర్తవ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏపీలో ఆలయాల ఉనికికి భంగం కలుగుతున్నపుడు మౌనంగా ఉండటం సరైంది కాదని అనిపించిందని… అందుకే.. ధనుర్మాసం పూర్తికాగానే ఓ క్రమంలో ఏయే ఆలయాలపై దాడులు జరిగాయో.. వాటన్నింటినీ సందర్శిస్తానని ఆయన ప్రకటించారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్రను చేపట్టనున్నట్లు చిన జీయర్ స్వామి వెల్లడించారు. ఆ సమయంలో అక్కడి ప్రజలతో మాట్లాడుతాను అని అన్నారు. అయితే ఏ ప్రాంతం నుంచి యాత్ర చేపట్టాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని, త్వరలోనే నిర్ణయించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంటిలిజెన్స్ విభాగంతో స్పష్టమైన కమిటీ వేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇలాంటి దాడులు చర్చి, మసీదులపై జరిగినా కూడా తీవ్రంగా స్పందించాలని కోరారు. దేవాలయం స్థానంలో చర్చి కానీ, మసీదు కానీ ఉంటే ప్రపంచం మొత్తం కదిలేదని, ఆలయాలను ఆసరాగా చేసుకొని జీవించే వారు శాంతియుతంగా ఉంటారని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..