బొత్సాతో జాగ్రత్త: చంద్రబాబు

చీపురుపల్లి: వైకాపా నేత  బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో గెలిస్తే మళ్లీ ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవని ఏపీ సీఎం, తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు  అన్నారు. బొత్స ఎలాంటివారో అందరికీ తెలుసని, ఆయనతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చీపురుపల్లిలో నిర్వహించిన సభలో  ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్‌కు తప్పుడు పనులు చేయడం అలవాటైందని..అటువంటి నాయకుడిని గెలిపిస్తే రాష్ట్రం రౌడీ రాజ్యంగా తయారవుతుందని పేర్కొన్నారు.  మన రాష్ట్రంపై కేసీఆర్‌ పెత్తనం […]

బొత్సాతో జాగ్రత్త: చంద్రబాబు
Follow us

|

Updated on: Mar 21, 2019 | 8:38 PM

చీపురుపల్లి: వైకాపా నేత  బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో గెలిస్తే మళ్లీ ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవని ఏపీ సీఎం, తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు  అన్నారు. బొత్స ఎలాంటివారో అందరికీ తెలుసని, ఆయనతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చీపురుపల్లిలో నిర్వహించిన సభలో  ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్‌కు తప్పుడు పనులు చేయడం అలవాటైందని..అటువంటి నాయకుడిని గెలిపిస్తే రాష్ట్రం రౌడీ రాజ్యంగా తయారవుతుందని పేర్కొన్నారు.  మన రాష్ట్రంపై కేసీఆర్‌ పెత్తనం చెయ్యాలనుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌ కీలుబొమ్మ అని…ఆయన జుట్టు మోదీ, కేసీఆర్‌ చేతుల్లో ఉంది. జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉంటేనే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని  చంద్రబాబు అన్నారు.