రాహుల్ గాంధీకి షాకింగ్ న్యూస్… హోం శాఖ ఏంచేసిందంటే..?
కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి భారీ ఝలక్ ఇచ్చింది. అలాంటి ఇలాంటి ఝలక్ కాదు.. ఇక ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంట ఎస్పీజీ కమాండోలు వెన్నంటే ఉంటారు. ఇక రహస్య టూర్లు వెళ్లడానికి కూడా వీళ్లేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఈ ఎస్పీజీ కమాండోలు వెళ్తారు. అయితే ఇదేంటీ ఎస్పీజీ కమాండోలు రాహుల్ కుటుంబానికి రక్షణగా ఉన్నారు కదా.. అని అనుకునేరు.. ఇప్పటి వరకు ఎస్పీజీ భద్రత ఉన్నా.. వారు విదేశీ టూర్లు వెళ్లే […]
కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి భారీ ఝలక్ ఇచ్చింది. అలాంటి ఇలాంటి ఝలక్ కాదు.. ఇక ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంట ఎస్పీజీ కమాండోలు వెన్నంటే ఉంటారు. ఇక రహస్య టూర్లు వెళ్లడానికి కూడా వీళ్లేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఈ ఎస్పీజీ కమాండోలు వెళ్తారు. అయితే ఇదేంటీ ఎస్పీజీ కమాండోలు రాహుల్ కుటుంబానికి రక్షణగా ఉన్నారు కదా.. అని అనుకునేరు.. ఇప్పటి వరకు ఎస్పీజీ భద్రత ఉన్నా.. వారు విదేశీ టూర్లు వెళ్లే ముందు వారిని వెనక్కి పంపేవారు. అయితే రహస్య టూర్లకు చెక్ పెడుతూ కేంద్ర షాకింగ్ న్యూస్ తెలిపింది. దేశంలో అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించింది. దీంతో కొత్త నిబంధనల ప్రకారం వీవీఐపీలు(ఎస్పీజీ భద్రత కల్గిన వారు) ఇక నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎస్పీజీ సిబ్బంది వారిని డేగకన్నులా వెంటనే ఉంటుంది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో ఈ ఎస్పీజీ భద్రతని ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యుల హోదాలో రాహుల్ గాంధీకి కూడా ఎస్పీజీ భద్రత ఉంది. ప్రతినిత్యం ఆయనకు భద్రతా కమాండోలు రక్షణ కల్పిస్తుంటారు. అయితే రాహుల్ గాంధీ ఎస్పీజీ కమాండోలను తనతో విదేశాలకు రానివ్వడం లేదు. సడన్గా విదేశీ టూర్లు ప్లాన్ చేసుకుని.. వెళ్లడం.. మళ్లీ కొద్ది రోజులుగా ఎవరికీ టచ్లో లేకుండా ఉండటం.. ఆయన ఎక్కడ తిరుగుతారో ఎవరికీ తెలియనివ్వకపోవడం.. ఇది గతకొద్ది రోజులుగా రాహుల్ తీరు.
అయితే ఈ మధ్య కాంబోడియా పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ వెళ్లారు. ఆ సమయంలోనే వీవీఐపీల భద్రతా నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఇప్పటిదాకా విదేశాలకు వెళ్తే ఎస్పీజీ సిబ్బందిని కొన్ని ప్రదేశాలకు వారితో రాకుండా వీవీఐపీలు నియంత్రించే వారు. కానీ సవరించని నిబంధనల కారణంగా ఇక ప్రతిక్షణం వీవీఐపీల వెన్నంటే ఉండనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ప్రభుత్వం చెప్తోంది.
అంతేకాదు.. ఒకవేళ ఎస్పీజీ సిబ్బందిని అనుమతించకపోతే వారి విదేశీ టూర్లను ఇక నుంచి కేంద్రం నియంత్రించే అవకాశం ఉంది. గాంధీ కుటుంబీకులు ఇప్పటి దాకా విదేశాలకు వెళ్లినపుడు వారు మొదట గమ్యస్థానం చేరేవరకు ఎస్పీజీ సిబ్బంది వారిని అనుసరిస్తూ రక్షణ కల్పించేవారు. అక్కడినుంచి ఎస్పీజీ సిబ్బందిని వెనక్కి పంపి వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు వెళ్లి పర్యటనలు ముగించకొని వచ్చేవారు. అయితే సవరించిన భద్రతా నియమాల కారణంగా వీవీఐపీల రహస్య పర్యటనలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి.