OBC Creamy Layer: కీలక ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ పరిమితిని పెంచుతారా?.. ఓబీసీలకు మేలు జరిగేనా?..

OBC Creamy Layer: ఓబీసీ క్రీమీలేయర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో కేంద్రం చేసిన..

OBC Creamy Layer: కీలక ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ పరిమితిని పెంచుతారా?.. ఓబీసీలకు మేలు జరిగేనా?..
Parliament session updates
Follow us

|

Updated on: Feb 03, 2021 | 4:45 AM

OBC Creamy Layer: ఓబీసీ క్రీమీలేయర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో కేంద్రం చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. దేశంలో వెనుబడిన తరుగతుల వారికి ఆదాయ పరిమితిని(ఓబీసీ క్రీమీలేయర్) పెంచాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ఓబీసీ క్రీమీలేయర్‌కు సంబంధించి నిర్ణయాలపై కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు పలు ప్రశ్నలు వేశారు. దీనికి స్పందించిన కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి కృపన్‌పాల్ గుర్జాన్.. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. క్రీమీలేయర్‌కు సంబంధించి ఇప్పటికే జాతీయ వెనుకబడిన తరగతుల సంఘాలతో సంప్రదింపులు జరిపామన్నారు. వారితో చర్చల తరువాతే ఓబీసీ క్రీమీలేయర్ పరిమితిని పెంచాలని ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఓబీసీల ఆదాయ పరిమితి రూ. 8 లక్షలుగా ఉందని, త్వరలోనే దినిని పెంచుతామని స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ఆదాయ పరిమితి పెంచినట్లయితే దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఓబీసీలకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో, ఇతర అవకాశాల్లో లబ్ధి పొందగలుగుతారు.

Also read:

అమెరికాలోని భారతీయ విద్యార్థులకు, హెచ్ 1 బి వీసా హోల్డర్లకు మళ్లీ మంచిరోజులు, ప్రెసిడెంట్ బైడెన్ నేతృత్వంలో కొత్త అడుగులు

Central Govt: ఆ విషయంలో రాష్ట్రాలదే నిర్ణయాధికారం.. లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!