మమ్మల్ని జంతువుల్లా బంధించారు… అమిత్షాకు లేఖ!
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్ ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దీంతో పాటు వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేశారు. ‘దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటుంటే మాకు మాత్రం ఆ అవకాశం లేదు. పశువులను బంధించినట్లు మమ్మల్ని బంధించారు. మానవ హక్కులను […]
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్ ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దీంతో పాటు వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేశారు. ‘దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటుంటే మాకు మాత్రం ఆ అవకాశం లేదు. పశువులను బంధించినట్లు మమ్మల్ని బంధించారు. మానవ హక్కులను కొల్లగొట్టారు’ అని లేఖలో పేర్కొన్నారు.
‘నన్ను కూడా నిర్బంధించారు. కర్ఫ్యూ విధించినప్పటి నుంచి కశ్మీర్లో ఏం జరుగుతుందో మీడియాతో చెప్పినందుకు నన్నిలా చేశారు. నన్ను బెదిరిస్తున్నారు. అందుకే నేను మరోసారి మీడియాతో మాట్లాడాలనుకుంటున్నాను. నన్నో నేరస్థురాలిగా పరిగణిస్తున్నారు. నా జీవితం పట్ల ఎంతో భయంగా ఉంది’ అని వాయిస్ మెసేజ్లో పేర్కొన్నారు.