జంతువులపై కోవాగ్జిన్ ట్రయల్ టెస్ట్ సక్సెస్, భారత్ బయో టెక్
తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ కరోనా వైరస్ వ్యాక్సీన్ తో జంతువులపై జరిపిన ట్రయల్ టెస్ట్ సక్సెస్ అయిందని భారత్ బయో టెక్ సంస్థ ప్రకటించింది. ఈ టెస్టులో మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొంది.
తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ కరోనా వైరస్ వ్యాక్సీన్ తో జంతువులపై జరిపిన ట్రయల్ టెస్ట్ సక్సెస్ అయిందని భారత్ బయో టెక్ సంస్థ ప్రకటించింది. ఈ టెస్టులో మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొంది. ఈ వ్యాక్సీన్ తో వాటిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఈ కంపెనీ వెల్లడించింది. ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సీన్ ఫ్రంట్ రన్నర్ రేసులో కోవాగ్జిన్ ఒకటి. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సీన్ ని దేశ వ్యాప్తంగా 12 సంస్థల్లో టెస్ట్ చేస్తున్నారు. ఇలా ఉండగా ఇండియాలో గత 24 గంటల్లో 1,201 కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 77,472 కి పెరిగింది.