ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్ట్లకు మరోసారి బ్రేక్
హైదరాబాద్లోని ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్ట్లకు మరోసారి బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులు బంద్ చేయనున్నారు.
హైదరాబాద్లోని ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్ట్లకు మరోసారి బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులు బంద్ చేయనున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోసం ల్యాబుల్లో కరోనా టెస్టులను నిలిపివేశారు. ఈ సందర్భంగా రిపోర్టుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో కరోనా టెస్టుల సేకరణ, టెస్టింగ్లపై ల్యాబ్ సిబ్బంది ట్రైనింగ్ అప్డేట్ చేయనున్నారు. ఇక ప్రభుత్వ ల్యాబ్ల్లో యథావిథిగా కొనసాగుతున్న శ్యాంపిల్ సేకరణ కొనసాగనుంది. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 80వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 17వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.