నాటుపడవ మునిగి ముగ్గురు గల్లంతు..!

ఆంధ్రా, ఒడిశా మధ్య సీలేరు నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారితో సహా మరో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. పడవలో మొత్తం ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పడవలో నది దాటుతుండగా గాలి దుమారం ఎక్కువై.. అలల తాకిడికి పడవ మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ముగ్గురు గల్లంతు కాగా.. మిగిలిన వారిని స్థానిక మత్స్యకారులు రక్షించినట్లు తెలుస్తోంది. ఒడిస్సాలోని గుర్రాలూరుకి చెందిన గిరిజనులు విశాఖ జిల్లా సీలేరులో జరిగే సంతకి వచ్చి […]

నాటుపడవ మునిగి ముగ్గురు గల్లంతు..!
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 11:19 AM

ఆంధ్రా, ఒడిశా మధ్య సీలేరు నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారితో సహా మరో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. పడవలో మొత్తం ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పడవలో నది దాటుతుండగా గాలి దుమారం ఎక్కువై.. అలల తాకిడికి పడవ మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ముగ్గురు గల్లంతు కాగా.. మిగిలిన వారిని స్థానిక మత్స్యకారులు రక్షించినట్లు తెలుస్తోంది. ఒడిస్సాలోని గుర్రాలూరుకి చెందిన గిరిజనులు విశాఖ జిల్లా సీలేరులో జరిగే సంతకి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.