బెంగాల్ లో బీజేపీ కార్యకర్త దారుణ హత్య, ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, 12 గంటల బంద్ కు పిలుపు
పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో బీజేపీ కార్యకర్తనొకరిని కొట్టి చంపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దారుణానికి కారకులని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటనతో..
పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో బీజేపీ కార్యకర్తనొకరిని కొట్టి చంపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దారుణానికి కారకులని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని టీ ఎంసీ కొట్టి పారేసింది. కాలాచందర్ కర్మాకర్ అనే ఈ బీజేపీ కార్యకర్త హత్యకు నిరసనగా ఈ పార్టీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ జిల్లాలోని తుఫాన్ గంజ్ టౌన్ లో తన షాపు ఎదుట కొట్టుకుంటున్న గుంపును నివారించేందుకు వెళ్లిన ఇతడిని కొంతమంది కొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇది స్థానిక వివాదమేనని, తమకు ఈ గొడవతో సంబంధంలేదని టీఎంసీ నేతలు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.