మెజారిటీ కోసమే చేర్చుకున్నాం: బీజేపీ నేత జీవీఎల్
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై ఆపార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. లోక్సభలో పూర్తి మెజారిటీని సాధించిన తమ పార్టీకి రాజ్యసభలో కూడా మెజారిటీ కోసమే వీరిని చేర్చుకున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల నాటికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా మారనుందన్నారు. రాజ్యసభలో సంఖ్యా పరమైన ఇబ్బందుల్ని అధిగమించి కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునే విషయంలో ఎలాంటి అవరోధం ఎదురుకాబోదని ధీమా వ్యక్తం చేశారు జీవీఎల్. తమ పార్టీలో చేరినంత మాత్రాన […]
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై ఆపార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. లోక్సభలో పూర్తి మెజారిటీని సాధించిన తమ పార్టీకి రాజ్యసభలో కూడా మెజారిటీ కోసమే వీరిని చేర్చుకున్నామని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల నాటికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా మారనుందన్నారు. రాజ్యసభలో సంఖ్యా పరమైన ఇబ్బందుల్ని అధిగమించి కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునే విషయంలో ఎలాంటి అవరోధం ఎదురుకాబోదని ధీమా వ్యక్తం చేశారు జీవీఎల్.
తమ పార్టీలో చేరినంత మాత్రాన చట్టపరంగా ఉన్న అభియోగాలపై విచారణ ఆగిపోదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా రాద్దాంతం చేసిన పార్టీలకు తగిన శాస్తి జరిగిందని , అలాంటి పార్టీల్లో ముందు వరుసలో టీడీపీనే ఉందంటూ ఎద్దేవా చేశారు జీవీఎల్.