Bank Employee Crime: శృంగార క్యాషియర్.. లోన్ కోసం వచ్చిన 40 మంది మహిళలను…
పేరుకు అతడొక బ్యాంక్ క్యాషియర్.. కానీ సీక్రెట్గా చేసే పనులు వింటే షాక్ అవ్వాల్సిందే. రోజూ బ్యాంక్కు రుణాల కోసం వచ్చే మహిళలను లోబరుచుకుని.. వారితో ఉల్లాసంగా గడుపుతుంటాడు.
Bank Employee Crime: పేరుకు అతడొక బ్యాంక్ క్యాషియర్.. కానీ సీక్రెట్గా చేసే పనులు వింటే షాక్ అవ్వాల్సిందే. రోజూ బ్యాంక్కు రుణాల కోసం వచ్చే మహిళలను లోబరుచుకుని.. వారితో ఉల్లాసంగా గడుపుతుంటాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు ఈ కామాంధుడు. భర్త సాగించిన రాసలీలల వీడియోలను, ఫోటోలను కట్టుకున్న భార్యే బట్టబయలు చేయడంతో ఈ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇక అరెస్ట్ చేస్తారనే భయంతో ఆ ప్లేబాయ్ భర్తతో సహా ఐదుగురు కుటుంబసభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
Also Read: Lakhs Of Rupees For Old Coins And Notes
వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) వీరలిమలైలోని ఇండియన్ బ్యాంక్లో క్యాషియర్గా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన అతడికి రెడ్డిపాళయానికి చెందిన యువతి(32)తో వివాహం జరిగింది. అయితే పెళ్ళైన రోజు నుంచి జయకుమార్ ఆమెతో సఖ్యతగా ఉండటం లేదు. రోజూ గంటల తరబడి వేరే గదిలో వెళ్లి పలువురి మహిళలతో ఫోన్లో అశ్లీలంగా మాట్లాడటం అతడి భార్య గమనిస్తూ వచ్చింది.
అసలు విషయమేంటని తెలుసుకోవడానికి ఒకరోజు భర్త బ్యాంక్కు వెళ్లిన సమయంలో ఆ గదిలోకి వెళ్లగా.. అక్కడ ఆమెకు 15 సెల్ఫోన్లు, వాటిల్లో భర్త జయకుమార్ వేరే మహిళలతో అర్ధనగ్నంగా, నగ్నంగా దిగిన ఫోటోలు, బాత్రూమ్ వీడియోలు కనిపించాయి. అవన్నీ చూసి ఆమె ఒక్కసారిగా విస్తుపోయింది. ఈ దారుణాలను తన అత్తింటివారితో చెప్పుకుని సదరు యువతి విలపించింది. అయితే వాళ్లు ఆమె మాటలు అసలు పట్టించుకోలేదు. అంతేకాకుండా అతడి రహస్య విషయాలన్నీ బహిర్గతం కావడంతో జయకుమార్ ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు.
‘నువ్వు స్నానం చేసేటప్పుడు సీక్రెట్గా వీడియో తీశాను. నా విషయాలు బయటపెడితే సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను వైరల్ చేస్తానని బెదిరించాడు’. దీనికి అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా కూడా సహకరించింది. దీంతో ఆ యువతి చేసేదేమిలేక తల్లిదండ్రుల దగ్గర తన గోడు చెప్పుకుంది.
Also Read: IIT Professor Hidden Camera In Washroom
ఇక తన రహస్య కార్యకలాపాలన్నీ బయటపెట్టిన భార్యను ఎలాగైనా చంపాలని స్కెచ్ వేశాడు. అతడి బారి నుంచి ఆమె రెండుసార్లు తప్పించుకుంది. ఈ ఆగడాలను తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్కు ఫిర్యాదు చేసింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా, కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.