లాక్డౌన్ ఎఫెక్ట్: పెరిగిన సైబర్ నేరాలు..!
కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. చాలా
కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌలభ్యం కల్పించాయి. సైబర్ నేరగాళ్లకు ఇప్పుడిది వరంగా మారింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఓ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు జూమ్ యాప్ ద్వారా మేనేజ్మెంట్తో వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చాడు. మీటింగ్ ప్రారంభమైన కాసేపటికే స్క్రీన్ హ్యాక్ అయింది. స్క్రీన్పై అశ్లీల దృశ్యాలు ప్లే అవడం ప్రారంభమైంది. దీంతో మీటింగ్లో ఉన్న అందరూ ఒక్కసారిగా కాల్స్ కట్ చేశారు.
కాగా.. కోవిద్ 19 పై పోరుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల దేశ ప్రజలను కోరారు. ఆయన అలా అన్నారో, లేదో పీఎంకేర్స్ పేరుతో వందలాది ఫేక్ యూపీఐలు పుట్టుకొచ్చాయి. అవి ఫేక్ ఐడీలని తెలుసుకునే లోపే సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు దండుకున్నారు. హోం నెట్వర్క్లు చాలా బలహీనంగా ఉండడంతో సైబర్ దాడులకు ఇవి ఎక్కువగా గురవుతుంటాయి. మీ సమీపంలో కరోనా వైరస్తో బాధపడుతున్నవారి గురించి తెలియజేస్తామని, కోవిడ్-19 హీట్మ్యాప్స్ అందిస్తామంటూ డజన్ల కొద్దీ మెసేజ్, వెబ్సైట్లు వస్తున్నాయి. వీటిని నమ్మి క్లిక్ చేస్తే ఇక పని అయిపోయినట్టే. ఇలాంటి వన్నీ చివరికి హ్యాకింగ్తో ముగుస్తాయి.
Also Read: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు..