అలెర్ట్: ఏపీలోని ఈ ప్రాంతాలకు వెదర్ వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్కితోడు ఈ వర్షాలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా..
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్కితోడు ఈ వర్షాలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఈ రోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ రోజు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే రాయలసీమలో ఈరోజు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read More:
షిర్డీ సాయిబాబా దర్శన భాగ్యం ఎప్పుడంటే?
వాట్సాప్లో మరిన్ని సేవలు.. త్వరలోనే పెన్షన్ సర్వీసులు కూడా!