గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!

లాక్ డౌన్ కారణంగా గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లను మార్చుకునే అవకాశం కల్పించగా... దీనికి సంబంధించిన గడువును పంచాయతీరాజ్ శాఖ మరోసారి పొడిగించింది.

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!
Follow us

|

Updated on: Jul 03, 2020 | 10:06 PM

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టులకు పరీక్షలను ఆగష్టు 9-14 వరకు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అటు లాక్ డౌన్ కారణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది అభ్యర్థులు సొంతూళ్లకు వెళ్లిపోగా.. వారికి ఎగ్జామ్ సెంటర్లను మార్చుకునే అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పంచాయతీరాజ్ శాఖ మరోసారి పొడిగించింది. గతంలో విధించిన గడువు తాజాగా ముగియడంతో.. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వారుంటున్న చోటే పరీక్షా కేంద్రాలను ఎంచుకోవచ్చునని అధికారులు వెల్లడించారు.

కాగా 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!