ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్లెస్ ప్రయాణం..!
కరోనా వైరస్ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. 'ప్రథమ్' అనే పేరుతో ఏపీఎస్ఆర్టీసీ నూతన అప్లికేషన్ను ఆగష్టు 1న లాంచ్ చేయనుంది.
కరోనా వైరస్ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘ప్రథమ్’ అనే పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ఈ నూతన అప్లికేషన్ను ఆగష్టు 1న లాంచ్ చేయనుంది. సూపర్ లగ్జరీ సర్వీసుల దగ్గర నుంచి పల్లెవెలుగు బస్సుల దాకా అన్ని టికెట్లను దీని ద్వారానే బుక్ చేసుకునే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది.
Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!
ఇక ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ధరలో ఐదు శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి నగదురహిత లావాదేవీలను జరిపేందుకు వీలుగా ఈ ‘ప్రథమ్’ యాప్ను రూపొందించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ను కూడా అప్గ్రేడేషన్ చేశారు. కాగా, ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,934 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read: కుల ధృవీకరణ లేకుండానే మైనారిటీలకు ‘వైఎస్ఆర్ చేయూత’…