ఏపీలో 2100కు చేరిన క‌రోనా..

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరింది.

ఏపీలో 2100కు చేరిన క‌రోనా..
Follow us

|

Updated on: May 14, 2020 | 1:03 PM

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 36 మందికి కరోనా సోకింది. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరొకరు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 48కి పెరిగింది.  కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 15 మందికి కరోనా సోకింది.

ఏపీ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 1192 మంది కోలుకోగా, 860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నెల్లూరులో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5 ఉండగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు చొప్పున, పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యాయి. ఇవాళ మరణించిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన వారు కాగా, వైరస్‌ బారిన పడిన 50 మంది కోలుకుని ఈ రోజు డిశ్చార్జి అయ్యారు.
ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా కర్నూలులో 591 కేసులు, గుంటూరులో 404, కృష్ణాల  351, చిత్తూరు 151, నెల్లూరు 126, అనంతపురంలో 118, కడప 99, పశ్చిమ గోదావరి 69, విశాఖపట్నం 66, ప్రకాశం 63, తూర్పుగోదావరి 51, శ్రీకాకుళం 7, విజయనగరం 4 కేసుల చొప్పున న‌మోద‌య్యాయి.