నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్‌ స్వయంగా మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, మేకతోటి సుచరిత, […]

నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 6:08 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్‌ స్వయంగా మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సభలో పాల్గొంటారు.