ఇండియా నుంచి అమెరికా చేరిన ఆ ‘మందు’

మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు భారత్ నుంచి అమెరికా చేరింది. కరోనా వ్యాధి ట్రీట్ మెంట్ కు ఇది మంచి మెడిసిన్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు భావిస్తున్న సంగతి విదితమే..

ఇండియా నుంచి అమెరికా చేరిన ఆ 'మందు'
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 12, 2020 | 12:20 PM

మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు భారత్ నుంచి అమెరికా చేరింది. కరోనా వ్యాధి ట్రీట్ మెంట్ కు ఇది మంచి మెడిసిన్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు భావిస్తున్న సంగతి విదితమే.. ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఈ మెడిసిన్ తో కూడిన విమానం శనివారం అమెరికాలోని నెవార్కా విమానాశ్రయానికి చేరుకుంది. 35.82 లక్షల హైడ్రాక్సీ మందుతో బాటు 9 మెట్రిక్ టన్నుల పారాసిటిమాల్ కూడా యుఎస్ చేరింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు జరుపుతున్న పోరాటంలో భాగంగా ఇండియా ఈ మందును పంపిందని అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు. ఇది తమ దేశానికి చేరగానే అమెరికన్లు దీన్ని స్వాగతించారు. భారత్ చూపుతున్న ఈ మానవతా దృక్పథాన్ని తాము మరచిపోలేమన్నారు. గతంలో కన్నా ఇప్పుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య స్నేహ బంధం మరింత ధృఢతరమైందని న్యూయార్క్ లోని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఒకరు హర్షం వ్యక్తం చేశారు.

కాగా-ఓ కొత్త ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం.. వెయ్యికి పైగా ఆస్పత్రుల లోని కరోనా రోగులకు హైడ్రాక్సీ మందును యాంటీ బయాటిక్ మెడిసిన్స్ తో బాటు  ఇవ్వగా వారి ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడిందట.