మిక్స్‌డ్‌ టాక్ వస్తుందని ముందే తెలుసు: అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. మాస్ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌పై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ చాలా పూర్‌గా ఉందంటూ క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో సరిలేరు క్లైమాక్స్‌పై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు […]

మిక్స్‌డ్‌ టాక్ వస్తుందని ముందే తెలుసు: అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2020 | 12:59 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. మాస్ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌పై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ చాలా పూర్‌గా ఉందంటూ క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో సరిలేరు క్లైమాక్స్‌పై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్లైమాక్స్‌కు మిక్స్‌డ్ టాక్ వస్తుందని ముందే తెలుసని అనిల్ అన్నారు. ‘‘సరిలేరు క్లైమాక్స్‌కు క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ టాక్ వచ్చింది. దీన్ని నేను ఒప్పుకుంటా. ఈ సన్నివేశాన్ని రాసేటప్పుడే దీనికి మిక్స్‌డ్ టాక్ వస్తుందని అనుకున్నా. కానీ ఈ చిత్రానికి ఇదే బెస్ట్ క్లైమాక్స్ అన్నది నా అభిప్రాయం’’ అని అనిల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ క్లైమాక్స్‌కు మహేష్ నుంచి కూడా మొదట్లోనే సానుకూల స్పందన వచ్చిందని, అందుకే అలానే పెట్టామని అన్నారు.