ఆవుపై పగ తీర్చుకున్న ఏనుగు!

చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామాలు, పంటపొలాలపై దాడి చేసి భారీ నష్టాన్నిమిగిల్చిన ఏనుగులు..ఇప్పుడు మూగ జీవాలపై పగపడుతున్నాయి. జిల్లాలోని గంగవరం మండలం గాంధీనగర్‌లో ఓ ఆవుపై అడవిఏనుగు పగ తీర్చుకుంది. ఈ నెల 2వ తేదీన నోరులేని గోమాతపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. నడుము విరిగి పూర్తిగా లేవలేని స్థితిలో ఆ ఆవు..నేలకే పరిమితమైంది. ఆవు యజమాని దానికి వైద్య చికిత్స లు అందజేస్తూ..ప్రాణం […]

ఆవుపై పగ తీర్చుకున్న ఏనుగు!
Follow us

|

Updated on: Sep 17, 2019 | 5:41 PM

చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామాలు, పంటపొలాలపై దాడి చేసి భారీ నష్టాన్నిమిగిల్చిన ఏనుగులు..ఇప్పుడు మూగ జీవాలపై పగపడుతున్నాయి. జిల్లాలోని గంగవరం మండలం గాంధీనగర్‌లో ఓ ఆవుపై అడవిఏనుగు పగ తీర్చుకుంది. ఈ నెల 2వ తేదీన నోరులేని గోమాతపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. నడుము విరిగి పూర్తిగా లేవలేని స్థితిలో ఆ ఆవు..నేలకే పరిమితమైంది. ఆవు యజమాని దానికి వైద్య చికిత్స లు అందజేస్తూ..ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నాడు..అలా లేవలేని స్థితిలో కూడా ఆ ఆవు..తన దూడకు రెండు పూటలా పాలిస్తూ..వచ్చింది. ఈ క్రమంలోనే ఆ ఏనుగు మరోసారి ఆవుపై విరుచుకుపడింది. ఏనుగు తన పాదాలతో తొక్కి ఆవు ప్రాణం తీసింది. ఏనుగు ఇలా పగబట్టినట్లుగా రెండుసార్లు ఒకే ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల  విధ్వంసం సృష్టిస్తున్న ఏనుగుల బెడద తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే పగబడుతున్న గజరాజులు..మనుషులపై కూడా ప్రతాపం చూపిస్తాయని,  తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
Cow Killed 2