Minister Roja: పవన్ జోకర్.. నాగబాబు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలే : రోజా

మెగా బ్రదర్స్‌ ముగ్గురూ రాజకీయాలకు పనికిరారని రోజా కామెంట్ చేశారు. వాటికి ఈ నెల 7న నాగేంద్రబాబు, 11న చిరంజీవి, 12న చంద్రబాబు స్పందించారు. ఆ ముగ్గురూ చేసిన కామెంట్లకు తగ్గట్లు ఇవాళ రోజా మరోసారి కౌంటర్ ఇచ్చారు.

Minister Roja: పవన్ జోకర్.. నాగబాబు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలే : రోజా
Roja Vs Nagababu
Follow us

|

Updated on: Jan 14, 2023 | 12:41 PM

భోగిమంటలకు పూర్తిస్థాయిలో పొలిటికల్ టచ్ ఇచ్చారు రోజా. చంద్రబాబుపైనే కాదు పవన్, నాగబాబుపైన కూడా పంచ్‌లు వేశారు. డైమండ్‌ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ ఓ జోకర్ అన్నారు రోజా. నాగబాబు మనిషి ఎదిగారు గానీ, మెదడు పెరగలేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మేల్ ఈగో అనేది పవన్ కల్యాణ్‌కు, టవర్ స్టార్‌కు బాగా ఎక్కువగా ఉందన్నారు. వారికి రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు. కనీసం గెలవని గొట్టంగాళ్లు తన గురించి మాట్లాడటం.. చిల్లరగా ఉందన్నారు. అమ్ముడుపోయే వ్యక్తులు తమ గురించి మాట్లాడితే ఊరుకోమన్నారు. తాను కళాకారులతో డ్యాన్స్ చేస్తే.. వారు ట్రోల్ చేస్తున్నారని.. వారు మాత్రం కూతురు వయస్సున్న అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం ఓకేనా ప్రశ్నించారు. పవన్ అన్నింటిలోనూ ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. చిరంజీవి ఉండబట్టే ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు. తాను స్వయం కృషితో ఎదిగానని చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లోకి చిరంజీవి పనికిరారని ఉన్నదే చెప్పానన్నారు. ఆయనతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్నారు. చంద్రబాబుపై కూడా మంత్రి రోజా ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను.. మంటలో కలిపారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు బుద్ధిని జనం భోగీ మంటలో వేశారని ఆమె సెటైర్‌ వేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..