గేదెను తప్పించబోయి.. బోల్తా కొట్టిన ట్రాక్టర్..
కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. గేదె అడ్డంగా రావడంతో తప్పించబోయిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓబుళాపురం గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి చనిపోగా, మిగతా 10 మందికి గాయాలయ్యాయి. ఇటుక బట్టీలో పని కోసం ట్రాక్టర్లో 11 మంది వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.
కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. గేదె అడ్డంగా రావడంతో తప్పించబోయిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓబుళాపురం గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి చనిపోగా, మిగతా 10 మందికి గాయాలయ్యాయి. ఇటుక బట్టీలో పని కోసం ట్రాక్టర్లో 11 మంది వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.