ఆమె చావుకు కారణం తల్లిదండ్రులే.. ఎనిమిదో తరగతి చదివే అమ్మాయిని పది రోజుల క్రితం బలవంతంగా..

బాల్య వివాహాలు చేయొద్దని ప్రభుత్వం, అధికారులు ఎంత మొత్తుకున్నా కొంతమంది తల్లిదండ్రులకు అది చెవికెక్కడం లేదు.

ఆమె చావుకు కారణం తల్లిదండ్రులే.. ఎనిమిదో తరగతి చదివే అమ్మాయిని పది రోజుల క్రితం బలవంతంగా..
Follow us

|

Updated on: Dec 03, 2020 | 4:53 PM

Girl commits suicide: బాల్య వివాహాలు చేయొద్దని ప్రభుత్వం, అధికారులు ఎంత మొత్తుకున్నా కొంతమంది తల్లిదండ్రులకు అది చెవికెక్కడం లేదు. మూర్ఖపు నిర్ణయాలతో చదువుకునే పిల్లలకు పెళ్లిళ్లు చేసి అనవసరంగా వారి చావులకు కారణం అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా బాపులపాడు (మం) మల్లవల్లిలో జరిగింది. ఎనిమిదో తరగతి చదివే అమ్మాయికి పెళ్లి చేసి ఆమె చావుకు కారణమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కృష్ణా జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామంలో లో 8వ తరగతి చదువుకుంటున్న రాజీ అనే మైనర్‌కు తల్లి దండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. తనకు పెళ్లి వద్దని ఎంత మొత్తుకున్న బంధుగణం అంతా కలిసి 10 రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు జరిపించారు. దీంతో ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపానికి గురైన రాజీ అత్తవారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాజీకి బలవంతంగా పెళ్లి ఆమె చావుకు కారణమైనందున బాల్య వివాహాల చట్టం కింద ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రాజీ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాజీ చావుకు కారణమైన వారందరిపై విచారణ చేపట్టారు.

Latest Articles