అనంతపురం జిల్లాలో నాటు బాంబుల కలకలం

అనంతపురం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. గోరంట్ల మండలం కారవులపల్లిలోని వైసీపీ నేత ఆర్. వెంకట్ రెడ్డి నివాసం వద్ద నాలుగు నాటు బాంబులు లభ్యమయ్యాయి. ఇంటి వెనుక చెత్తలో వీటిని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ ధరణి కిశోర్ వెల్లడించారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాటుబాంబులు లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

అనంతపురం జిల్లాలో నాటు బాంబుల కలకలం
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 2:22 PM

అనంతపురం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. గోరంట్ల మండలం కారవులపల్లిలోని వైసీపీ నేత ఆర్. వెంకట్ రెడ్డి నివాసం వద్ద నాలుగు నాటు బాంబులు లభ్యమయ్యాయి. ఇంటి వెనుక చెత్తలో వీటిని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ ధరణి కిశోర్ వెల్లడించారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాటుబాంబులు లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.