విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం..వణికిపోతున్న స్థానికులు

విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలోని

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం..వణికిపోతున్న స్థానికులు

Updated on: Jul 27, 2020 | 4:22 PM

విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలోని షీలానగర్ కంటైనర్ యార్డులో ప్రమాదం సంభవించింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దట్టమైన పొగలతో మంటలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. హానికర రసాయనం ద్వారా మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది.

Follow Us