గవర్నర్తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్తో ప్రత్యేకంగా...
AP CM Jagan meet Governor : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్. 40 నిమిషాల పాటు జరిగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్తో సీఎం చర్చించారు.
ఫిబ్రవరిలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని ప్రభుత్వం ఇటీవలే శాసన సభలో తీర్మానం చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు, కారణాలపై గవర్నర్కు సీఎం వివరించినట్లు తెలిసింది. వీటితో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్తో భేటీ అనంతరం సీఎం జగన్ నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.
Dak Adalat : ఈ నెల 28న ‘పెన్షన్ అదాలత్’..పెన్షనర్ల సమస్యలకు ఇదో వేదిక.. ప్రకటన విడుదల చేసిన డాక్ సదన్.. Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు