అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణకు 100 కోట్లు

అమరావతి - అనంతపురం ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ కింద 100 కోట్లు రిలీజ్ చేసేందుకు జగన్ సర్కార్ పాలనానుమతులు జారీ చేసింది.

అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణకు 100 కోట్లు
Follow us

|

Updated on: Sep 28, 2020 | 11:28 PM

అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ కింద 100 కోట్లు రిలీజ్ చేసేందుకు జగన్ సర్కార్ పాలనానుమతులు జారీ చేసింది. ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగానూ నేషనల్ హైవేస్ సంస్థ ప్రాంతీయ అధికారికి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలిచ్చింది. భూసేకరణకు మొత్తంగా 2230 కోట్ల మేర ఖర్చవుతుందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ భూమిని ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియచేసింది. అదనంగా చేసే భూసేకరణ ఖర్చులో 50శాతం మేర భరించేందుకు కూడా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు విడుదల చేశారు.

Also Read :

ఏపీ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ మళ్లీ విడుదల !

Bharat Ratna for SPB: సీఎం జగన్‌కు కమల్ హాసన్ థ్యాంక్స్